కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రధానిగా మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశం కోసం నిర్విరామంగా పనిచేస్తూ వస్తున్నారాయన. ఇప్పుడు కరోనా విషయంలో కాస్త టెన్షన్గానే ఉన్నా...పరిస్థితులు కంట్రోల్లోనే ఉన్నట్లు వైద్య, నిఘా వర్గాల నుంచి నివేదికలు అందుతుండటంతో మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. ఇదిలా ఉండగా లాక్డౌన్తో అన్ని వ్యవస్థలు స్తంభించడంతో మోదీ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ సమయాన్ని తనకు ఇష్టమైన అభిరుచులకు వెచ్చిస్తున్నారట.
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ గురించి మన్ కి బాత్ లో మాట్లాడారు. తాజాగా ఈరోజు ఉదయం ప్రధాని మోదీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను అప్లోడ్ చేశారు. అలాగే మన్ కి బాత్ సందర్భంగా నా ఫిట్నెస్ దినచర్య గురించి అడిగారు. అందుకే ఈ యోగా వీడియోను షేర్ చేయాలని అనుకున్నాను. మీరు కూడా రోజూ యోగా చేస్తారని ఆశిస్తున్నాను.. అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే తాను ఫిట్నెస్ నిపుణుడనో లేదా వైద్య నిపుణుడినో కాదని ప్రధాని పేర్కొన్నారు. అయితే యోగా చేయడం చాలా సంవత్సరాలుగా జీవితంలో ఒక భాగంగా మారింది. ఎంతో ప్రయోజనం చేకూర్చింది. మీరు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ మార్గాలు అనుసరిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భారత్ విజయవంతమైందని ప్రపంచ దేశాలకు ఒక నమ్మకం ఏర్పడినట్లు కనబడుతోంది. అభివృద్ది చెందిన దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ ఇలా చాలా దేశాలు కరోనా బారినపడి కకావికలమైన విషయం తెలిసిందే. అయితే కరోనా ముప్పును కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా..భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు..ప్రజలు సహకరిస్తున్న తీరును అంతర్జాతీయ పత్రికలు పొగుడుతూ ఆకాశానికెత్తడం గమనార్హం. అయితే ఇందులో మోదీ ప్రజ్ఞ దాగి ఉందని గుర్తించిన మీడియా ఆయన పొగుడుతూ వార్త కథనాలను ప్రచురిస్తుండటం విశేషం.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple