ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలొో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దేశంలో ప్రజలంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి కరోనాపై పోరాడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన సమయంలో ప్రతిపక్ష నాయకులు రాజకీయాలు చేయడం తగదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.
ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఓ వైపు సూక్తులు చెబుతున్న చంద్రబాబు, మరో వైపు తన అనుచరులతో రాజకీయం చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ ల తీరును ఎండగడుతూ ఓ వీడియోను అంబటి విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతిపక్షాలు సహకరించని పక్షంలో దేశద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
గ్రామ వాలంటీర్లు ఎంతో ధైర్యంతో ప్రజల కోసం శ్రమిస్తున్నారు. కరోనా వైరస్ ఉన్నా.. ప్రబలి పోతున్నా సైనికుల్లా ఇంటింటికి తిరుగుతూ సేవలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై అపనిందలు వేయడానికి నోరు ఎలా వస్తుందని అన్నారు. గ్రామ వాలంటీర్ల ఆత్మస్థయిర్యం దెబ్బతినేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని, ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడాన్ని సోమిరెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple