కరోనా వైరస్ కారణంగా రోజుకు కొన్ని వేలమంది మృతి చెందుతున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన పడి ఏడు లక్షల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. 35వేలమందికిపైగా ఈ కరోనా బారిన పడి మృతి చెందారు.
ఇంకా ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అమెరికాలో ఎక్కువ ఉండగా ఇటలీలో మృత్యుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఇకపోతే ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. దీంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.
అయినప్పటికీ మన భారత్ లో ఇప్పటికి వెయ్యికిపైగా కరోనా వైరస్ కేసులు పాజిటివ్ వచ్చాయి. అంతేకాదు ఈ కరోనా బారిన పడి ఇప్పటికి 32మంది మృతి చెందారు. ఇంకా ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ కేసులు పాజిటివ్ నమోదు అయ్యాయి. ఇంకా తెలంగాణాలో ఇప్పటికే 71 కేసులు నమోదు కాగా ఈ ఒక్క రోజే 6 కేసులు కరోనా పాజిటివ్ వచ్చాయి. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మొత్తం 77కు చేరాయి. ఇకపోతే కరోనా బారిన పడి తెలంగాణాలో ఇప్పటికే ఒకరు మరణించగా ఈరోజు మరొక మరణం నమోదు అయ్యింది. దీంతో తెలంగాణాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 2 కు చేరింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple