ఇప్పుడు కరోనా వైరస్ ఏమో గాని జనాలు తినాలన్నా తాగాలన్నా సరే భయపడే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎంత భయపడుతున్నాయో గాని మన భారత దేశం మాత్రం ఇప్పుడు వణికిపోతుంది అనే చెప్పవచ్చు. కరోనా కారణంగా మన దేశంలో ఇప్పుడు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల సంఖ్య విషయానికి వస్తే 1300 కి దగ్గరలో ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడకు గట్టిగా తగిలింది. ఇక్కడ ముగ్గురు బాధితులు బయటపడగా... కృష్ణలంకలోని పాణి పూరి వ్యాపారికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. అతను ఇటీవల మక్కా వెళ్లి వచ్చాడు. అతనికి 20 పానీ పూరి బండ్లు ఉన్నాయని విజయవాడలో చాలా ప్రాంతాల్లో అతను తిరిగాడు అని అధికారులకు సమాచారం అందింది. ఇప్పుడు అతని వద్ద పానీ పూరి తిన్న వాళ్లకు భయం మొదలయింది. పరిస్థితి ఏంటీ అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అతను ఎవరు...? ఎక్కడ పానీ పూరీ అమ్మాడు...? చిన్న పిల్లల నుంచి కాలేజి విద్యార్ధులు, ఉద్యోగుల వరకు కూడా ఈ ప్రశ్న వేధిస్తుంది. అక్కడ కరోనా వైరస్ బయటపడితే బెజవాడ మొత్తం షేక్ అయిపోయింది. దీనితో ఇప్పుడు కృష్ణా జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయింది. అతని గురించిన పూర్తి స్థాయి సమాచారాన్ని జిల్లా అధికారులు సేకరిస్తున్నారు. అతను పప్పు ఎక్కడ కొన్నాద్, కొత్తి మీర ఎక్కడ కొన్నాడు, ఉల్లి పాయలు ఎక్కడ కొన్నాడు, ఇలా అన్నీ కూడా అధికారులు ఆరా తీసి ఇప్పుడు వైద్య పరిక్షలు చెయ్యడానికి రెడీ అయ్యారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple