ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన. చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... క్రమక్రమంగా అవకాశాలను చేజిక్కించుకుంటూ  వస్తోంది. గీతా గోవింద సినిమా తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే తనదైన క్యూట్ క్యూట్ అందాలతో అందరినీ ఆకర్షిస్తోంది. ఇక మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకొని దూసుకుపోతున్న ఈ అమ్మడుకు... నితిన్ భీష్మ సినిమాతో మరో హిట్ కూడా ఖాతాలో చేరిపోయింది. 

 

 దీంతో ప్రస్తుతం దర్శక నిర్మాతలు అందరి చూపు రష్మిక మందన పైనే పడింది. ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న నానుడి ని ఫాలో అవుతుంది రష్మిక మందన. తనకి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. మామూలుగానే హీరోయిన్ లకు వరుస  విజయాలను ఖాతాలో వేసుకుంటూ ఉంటే క్రేజ్  పెరగడంతోపాటు రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెరిగి పోతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు తమ రెమ్యునరేషన్ కి అడ్డు అదుపు లేకుండా పెంచుతూ ఉంటారు. ప్రస్తుతం రష్మిక మందన కూడా అదే చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 

 తన దగ్గరికి వచ్చిన దర్శక నిర్మాతలకు ఎన్నో కండిషన్ పెడుతోందట ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ కండిషన్స్ కి నో  చెబితే సినిమా చెయ్యను అని చెప్పేస్తుందట. స్టార్ హీరోలతో తప్ప యువ  హీరోలతో సినిమాలు చేయను అంటూ దర్శక నిర్మాతలకు చెప్పేస్తుందట ఈ అమ్మడు. స్టార్ డమ్ లేని యువ హీరోల ప్రాజెక్టులో తన దెగ్గరికి తీసుకు రావద్దు అంటు తెగేసి చెప్పేసిందట. ఇప్పటికే  మహేష్ బాబు సరసన మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. ఆచార్య లో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న చరన్  సరసన కూడా ఛాన్స్ కొట్టేసిన  విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది రష్మిక. ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్నది .

మరింత సమాచారం తెలుసుకోండి: