ప్రముఖ నిర్మాత మరియు సినీ నటుడు అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో అతను మాట్లాడే మాటలు నిజజీవితంలో కూడా అతనిని కమెడియన్ ను చేస్తుంటాయి. అలాగే బండ్ల గణేష్ నిర్మాత మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.. కాదు.. కాదు వీరభక్తుడు. చాలా సందర్భాల్లో బహిరంగ వేదికలపై పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని బండ్ల గణేష్ తనదైన శైలిలో చాటుకోవడం మరియు అతని స్పీచ్ లు పవన్ ఆకాశాన్ని ఎక్కించేలా ఉండడం జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు.

 

అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా అతనిపై విమర్శలు చేయడంతో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో బండ్ల గణేష్ రోజా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు. ఏకంగా నువ్వు ఎలాంటి పనులు చేసి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నావో మాకు తెలుసు అని అనేశాడు. అప్పట్లో పరిణామం సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో చాలా పెను సంచలనం సృష్టించింది. పవన్ పై ఒక మాట కూడా నేను పడనివ్వను అని బండ్ల గణేష్ మీడియా సాక్షిగా ఇష్టం వచ్చినట్లు తిట్టడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి.

 

అది గడిచి సంవత్సరాలు అయింది కానీ అప్పటి నుంచి గణేష్ కు రోజా కు మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదు. అయితే తాజాగా రోజా సోషల్ మీడియాలో వేసి ఒక పోస్ట్ గణేష్ రిప్లై ఇవ్వడం అందరినీ షాక్ కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే బండ్ల గణేష్ చాలా పెద్ద స్థాయిలో పౌల్ట్రీ వ్యాపారం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.  ఇటీవల కరోనా వైరస్ వచ్చిన సమయంలో చికెన్ మరియు గుడ్లు విషయంలో అనేక రూమర్లు రావడంతో పౌల్ట్రీ రంగం పడిపోయింది.

 

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వైసీపీ ఎమ్మెల్యే మరియు ఏపీఐసీసీ చైర్మన్ రోజా సెల్వమని ఇంటికే పరిమితం అయ్యే తమ కుటుంబ సభ్యులకు చికెన్ వండుతూ ఇలాంటి సమయంలో చికెన్ మరియు గుడ్ల అవసరం ఎంత ఉందో చెప్తున్నారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేపథ్యంలో బండ్ల గణేష్ రోజా గారు థాంక్యూ సో మచ్ అని కామెంట్ పెట్టారు. బండ్ల గణేష్ పెట్టిన కామెంట్ చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అన్న నువ్వేనా పెట్టింది అంటూ మరికొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: