మ‌న దేశంలో క‌రోనా ఉధృతి అంత‌కంత‌కూ పెరుగుతోంది. క‌రోనా క‌ట్ట‌డికి దేశం అంత‌టా ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్నా ప‌రిస్థితి మాత్రం ఆగ‌డం లేదు. ఇక నిమిషం నిమిషానికి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిమ‌షం నిమ‌షానికి క‌రోనా కేసుల సంఖ్య తెగ పెరిగిపోతోంది. ఇక మ‌న‌దేశంలో బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల అప్‌డేట్స్ చూస్తే ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 50కు చేరుకుంది. మ‌న దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా సోకినా మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువుగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతోంది.

 

ఇక ఈ లిస్టులో కేర‌ళ‌, పంజాబ్‌, రాజ‌స్తాన్‌, ఏపీ, తెలంగాణ ఉన్నాయి. నిన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌తో పోలిస్తే ఏపీ సేఫ్‌లో ఉంద‌ని అనుకున్నా.. ఇప్పుడు ఈ ఒక్క రోజే ఏపీలో ఏకంగా 43 కేసులు ఉండ‌డంతో ఏపీ ప‌రిస్థితి కూడా క్రిటిక‌ల్ అయిపోయింది. తాజాగా చూస్తే మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 320 కేసులు న‌మోదు కాగా..  16 మంది మృతి చెందారు. యూపీలో 25 ఏళ్ల యువ‌కుడు కూడా క‌రోనా దెబ్బ‌తో మృతి చెందారు. ఇక ఏపీలో 373 మంది ఢిల్లీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారికి ప‌రీక్ష‌లు చేయ‌గా వీరిలో  43 మందికి పాజిటివ్ వ‌చ్చింది. ఇక జిల్లాల వారీగా చూస్తే క‌డ‌ప‌, 15, క్నూలు 15, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 13,  విశాఖ 11,  గుంటూరు 9, చిత్తూరు 6, తూర్పు గోదావ‌రి జిల్లాలో సైతం 6 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: