భారత్లో కరోనా విస్పోటనం చెందే ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి. ఢిల్లీ మర్కజ్ భవన్లో జరిగిన ఆధ్యాత్మిక సభలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా ముస్లింలు పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఈ సభలో పాల్గొనడం తో వారితో సన్నిహితంగా మెలిగిన అనేక మందికి సోకింది. ప్రైమరీ కాంటాక్టు పద్ధతిలో వందలాదిమంది నుంచి వేలాదిమందికి విస్తరించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు వందకు పైగా కేసులు మర్కజీ మూలలతో బయట పడగా తెలంగాణలోనూ ఇప్పుడిప్పుడే నిర్ధారణ కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఇక మిగతా రాష్ట్రాల్లోనూ ఆందోళన కలిగించే ఫలితాలే వస్తున్నాయి. పరిస్థితి అదుపులోకి వచ్చేసింది.. ఏం భయం లేదనుకున్న కొన్ని గంటల్లోనే తెలంగాణలో ఆరుగురి మృతి చెందారు. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీనికంతటికీ కారణం ఒక్కటే.. అదే ‘మర్కజ్’. ఢిల్లీ నిజాముద్దీన్లోని ఈ భవనం పేరు వింటేనే అందరి వెన్నులో వణుకు పుడుతోంది. ఇక్కడ ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. వారంతా ఇప్పటికే తమ తమ రాష్ట్రాల్లో ఉండడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచమంతటా కరోనా చాప కింద నీరుగా పాకితే.. ఇండియాలో మర్కజ్ కేంద్ర బిందువుగా కరోనా వ్యాప్తి మొదలైందని ఇప్పుడు తెలుస్తున్న నిజం.
దీంతో కరోనా విస్పోటన సంకేతాలు స్పష్టమవుతున్నాయన్న ఆందోళన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నెలకొంది. లాక్ డౌన్కు ముందే కరోనా ఆయా రాష్ట్రాలకు మర్కజ్ నుంచి దిగుమతి అవడం గమనార్హం. అయితే లాక్డౌన్ నిర్ణయంతో పెనుప్రమాదాన్నే దేశం తప్పించుకున్నట్లుగా భావించాలని వైద్యులు చెబుతున్నారు. లేదంటే కరోనా సోకిన వారు ప్రైమరీ కాంటాక్టులతో లక్షలాదిమందికి వ్యాధి ప్రబలే ప్రమాదం ఉండేదని చెబుతున్నారు. అయితే ఇప్పటికే వీరి ద్వారా వేల సంఖ్యలోనే ఇతరులకు వ్యాప్తి చెంది ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple