ఏపీలో కరోనా నిమిషం నిమషానికి విజృంభిస్తోంది. ప్రతి గంటకు ఏపీలో కరోనా కేసులు కొత్తగా పెరిగిపోతున్నాయి. బుధవారం కొత్తగా ఒక్క రోజే ఏకంగా 67 కేసులు నమోదు అయ్యాయి. ఇక గురువారం కూడా కొత్తగా 21 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా, కడప జిల్లాల్లో 15 కేసులు నమోదు అవ్వగా.. పశ్చిమగోదావరి జిల్లాలో నిన్న ఒక్క రోజే 14 కేసులు నమోదు అయ్యాయి. ఇక అత్యధికంగా గుంటూరు జిల్లాలో 20 కేసులు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా 17 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఏపీలో 132 కేసులు నమోదు కావడంతో తెలంగాణను మించి పోయినట్లయ్యింది.
ఇప్పటి వరకు తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉండగా ఇప్పుడు ఏపీ తెలంగాణను క్రాస్ చేసి దేశంలో ఏడో స్తానంలోకి వెళ్లిపోయింది. ఇక ఈ కొత్త కేసులు అన్ని ఢిల్లీలో ప్రార్థనలకు వెల్లి వచ్చిన వారి ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయి. వారి కుటుంబ సభ్యులు, బంధువులు.. స్నేహితుల ద్వారా ఈ కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఏపీలో కంట్రోల్ తప్పే అవకాశాలే ఉన్నాయి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/
apple : https://tinyurl.com/NIHWNapple