ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 46 సంవత్సరాలున్న వ్యక్తి కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. ఈ వ్యక్తికి సంబంధించిన ఇంకో వ్యక్తి కూడా కరోనా వైరస్ తో అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. కాకపోతే పేషెంట్ మరణించాడు అని చెప్పడంతో జూనియర్ డాక్టర్ పై ఆ సదురు పేషెంట్ బంధువు దాడికి పాల్పడడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. దీనితో తమపై దాడికి దిగడంతో జూనియర్ డాక్టర్లు ఆందోళకు దిగారు. దీనితో వారు పోలీసులకు సమాచారం అందించిన వెంటనే ఏకంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ గాంధీ ఆసుపత్రికి చేరుకుని అక్కడ పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చారు. 

 

 

అయన అక్కడ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు ఆందోళనలను విరమించారు. గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ లపై దాడిని మంత్రి ఈటెల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ఆయన మీడియాతో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితిలో క్షమించమని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని అలా కొట్టడం ఏంటని, డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అభివర్ణించాడు. 

 


ఇలాంటి బయనకర సమయంలో ఇలాంటి ఘటనలు అసలు మంచిది కాదు. వారు 24 గంటలు డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారని వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి డాక్టర్ కి కచ్చితంగా రక్షణ కల్పిస్తాం, భరోసాతో పని చేయండి అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా చూస్తామని మంత్రి డాక్టర్లకు హామీ ఇచ్చారు. అయితే ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని సీవీ అంజనీ కుమార్ ఏర్పాటు చేసారు. 

 

 

అయితే ప్రస్తుతం ఈ కేసు లో కుత్బుల్లాపూర్ కి సంబంధించిన నలుగురి వ్యక్తులని అరెస్ట్ చేసారు. అలాగే జూనియర్ డాక్టర్లు CRPF పోలీసులను కరోనా వార్డులో ఉంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యతో రసత్రం అంత జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: