మాయరోగం కరోనా వైరస్ నిజంగానే మాయచేస్తోంది... అనడంలో సందేహం లేదు. ఎందుకంటే... ఇటీవల కరోనా వైరస్ టెస్ట్ నిర్వహించ వారిలో.. సదరు లక్షణాలు కనిపించకుండానే... కరోనా పాజిటివ్ రావడం ఇపుడు అందరితోనే ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఈ వార్త తెలిసినవారు ఇండ్లలో ఉన్నప్పటికీ.. తమకి కూడా కరోనా ఏమూలనో వుండే ఉంటుంది అనే అనుమానం కలగక మానదు...
ఇక ఓ వైపు చూసుకుంటే... ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు.. పాపం పెరిగిపోయినట్లు పెరిగిపోతున్నాయి... వీళ్ళలో 60 శాతం వృద్దులు కాగా.. 20 శాతం యువకులు, మధ్య వయస్కులు, మిగిలిన 20 శాతం చిన్న పిల్లలు అని WHO ఇటీవల ప్రకటించిన సంగతి అందరికి విదితమే. ఇక వీరిలో మరణానికి ఎక్కువగా గురవుతున్నది.. ముసలివాళ్ళు... చిన్నపిల్లలు అన్న సంగతి అందరికి తెలుసు. ఎందుకంటే వారిలో వ్యాధి నిరోధక శక్తే దానికి కారణం.
కొవిడ్ బారిన వారు ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో పలు ఇబ్బందులకు గురి అవుతుంటారు... అందుచేత అలాంటివారిని దృష్టిలో ఉంచుకొని... మెర్సిడెజ్ ఫార్ములా 1 సంస్థ ఓ వినూత్న ఐడియాను తెలియజేసింది. అదే "సీ పాప్" పరికరం. ఇది మాములుగా రాత్రిపూట గురక పెట్టేవారు యూస్ చేసే పరికరం. ఇపుడు దాన్ని సూచిస్తోంది సదరు కంపెనీ.. ఆ పరికరం ద్వారా రోగి, సులభంగా శ్వాస తీసుకోవచ్చన్నమాట..
ప్రపంచలో మొత్తం కేసులు: 9, 50, 713
మరణాలు: 48, 313
రికవరీ కేసులు: 2, 02, 826
ఇండియాలో మొత్తం కేసులు: 2032
మరణాలు: 58
కొత్త కేసులు: 34
రికవరీ కేసులు: 148
తెలంగాణలో మొత్తం కేసులు: 127
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 9
ఏపీలో మొత్తం కేసులు: 135
మృతులు: 0
ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
గుంటూరు: 20
నెల్లూరు: 20
ప్రకాశం: 17
కృష్ణా: 15
కడప: 15
పశ్చిమ గోదావరి: 14
విశాఖపట్నం: 11
తూర్పు గోదావరి: 9
చిత్తూరు: 8
అనంతపురం: 2
కర్నూలు: 1
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle