కరోనా వైరస్.. ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. అలాంటి ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తుంది. ఇంకా అలాంటి ఈ వైరస్ ఏపీలో కూడా కేవలం రెండు రోజుల్లో అమాంతం పెరిగిపోయింది. ఢిల్లీలో మతప్రార్థనలకు వెళ్లిన వారి కారణంగా ఆంధ్రలో కరోనా విజృంభించింది. 

 

ఇంకా ఇదే అదునుగా చేసుకున్న ప్రతిపక్షాలు పలకపక్షంపై నోరు పారేసుకున్నాయి. దీంతో ఆ మాటలపై స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీపై స్పందిస్తూ.. ''సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకునే మాఫియా అల్లాడుతోంది. సీఎం జగన్ గారు సీరియస్ గా లేరట. అత్యవసరాల పేరుతో దోచుకునే అవకాశం కోల్పోయామనేది వీరి ఏడుపు. కరోనా సోకితే ప్రాణం పోయినట్టేనని చెప్పాలట. ఆందోళన చెందొద్దు అని ధైర్యమిస్తే అప్రమత్తంగా లేనట్టట.'' అంటూ అయన ఓ ట్విట్ చేశారు. 

 

మరో 'ట్విట్'పై స్పందిస్తూ.. ''కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు చర్యలు తీసుకుంది. ఐసియూ బెడ్లు పెంచడం దగ్గర నుంచి దేనికీ కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అత్యవసర కొనుగోళ్లకు కలెక్టర్లకు అధికారాలిచ్చారు సిఎం జగన్ గారు. పచ్చ పార్టీ ఆర్తనాదాలను పట్టించుకోనవసరం లేదు.'' అంటూ మరో ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు కూడా పచ్చ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: