ఏపీలో కరోనా అల్ల కల్లోలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఈ రాకాసి విజృంభిస్తోంది. అయితే తాజాగా మరో మాడు కేసులు నమోదైయ్యాయి. దింతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 135కి చేరుకుంది. ఏపీలో కరోనా పాజిటివ్ సంఖ్య 24కి చేరుకుంది.

 

చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచదేశాలపై పడగ విప్పుతోంది. భారతదేశంలో వేలాది సంఖ్యలో కేసులు నమోదు కావడం..50 మంది చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం డేంజర్ బేల్స్ మ్రోగిస్తున్నాయి. ఏపీలో 135 పాజిటివ్ కేసులు నమోదవడం రాష్ట్రాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేసింది. దింతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

 

రాష్ట్రంలో వరుసగా కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంటోంది. అయితే ఏపీలో గుంటూరు, నెల్లూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ కారణంగా కేసులు అధికమైయ్యాయి.

 

కరోనా వైరస్ ప్రబలుతున్న క్రమంలోనే జిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర జిల్లాలకు సరిహద్దులను కంట్రోల్ చేసింది. దేశంలో ఈ జిల్లాలకు చెందిన వారు ఉండడం.. తిరిగి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా..అప్పటికే ఆలస్యం అయిపోయింది. అధికారులు తీసుకున్న చర్యలతో ఎక్కడి వారెక్కడే ఉండిపోయారు.

 

అయితే ఏపీలో రేపటి నుండి గుంటూరు, కడప, విశాఖలో అందుబాటులోకి పరీక్షా ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నారు. మరో విషయం ఏమిటంటే.. ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి ఈ రెండు జిల్లాల నుంచి కొంత మంది హాజరైయ్యారు. అయితే అక్కడికి వెళ్లిన వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పవచ్చు. నిజాముద్దీన్ ఎఫెక్ట్ రెండు జిల్లాలపై లేదు. పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలో ఒక్కకేసు కూడా లేకపొవడం ఈ రెండు జిల్లాలకు కలిసి వచ్చింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: