కరోనా సమయంలో ఇల్లు వదలి బయటకు రావాలంటేనే కాళ్లు గజగజ వణుకుతున్నాయి. ఎందుకంటే క్రమంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడ ఎటు నుంచి కరోనా వచ్చి మీద పడుతుందో అన్న ఆందోళన జనంలో కనిపిస్తోంది. కానీ నిత్యావసరాల కోసం బయటకు రాక తప్పడం లేదు.

 

 

ఇలా బయటకు వచ్చేందుకు ఉన్న కారణాల్లో కూరగాయలు ఓ ప్రధాన కారణం. అందుకే ఏపీ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్‌ రైతు బజార్లను పెద్ద ఎత్తున పెంచాలని నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా వార్డులు, కాలనీల్లో మొబైల్‌ రైతు బజార్లు తిప్పాలని నిర్ణయించారు. ఒక్కొక్క రైతు బజారును ఐదు రైతు బజార్లుగా వికేంద్రీకరిస్తున్నారు.నియోజకవర్గంలో ఎమ్మెల్యే చొరవ తీసుకొని వ్యాపారులతో మాట్లాడి ధరలు అధికంగా లేకుండా మొబైల్‌ బజార్లు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

 

 

ఉదయం వేళ తోపుడు బళ్ల ద్వారా పండ్లు, కూరగాయలు విక్రయించేలా అనుమతివ్వాలని అధికారులను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. అలాగే నిత్యవసరాల వస్తువులకు కొరత రాకుండా చూడాలంటూ సీఎం ఇప్పటికే ఆదేశించారు. అనవసరంగా ధరలు పెంచాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా అరటిని కొనుగోలు చేస్తున్నామని , నిల్వ ఉంచలేని పండ్లు, కూరగాయలకు మార్కెట్‌ క్రియేట్‌ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

 

 

కాకినాడ రూరల్‌లో మంత్రి కన్నబాబు ఓ మొబైల్‌ రైతు బజార్లను జెండా ఊపి ప్రారంభించారు. రైతులకు తమ పంటలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు వస్తే సంబంధిత అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తే పరిష్కారం చూపిస్తారని కన్నబాబు తెలిపారు. ఇక ఇంటి వద్దకే కూరగాయలు వస్తే అంతకుమించి కావాల్సిందేముంటుంది..! ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు.. ఇలాంటి సమయంలో ఇవి చాలా అవసరం.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: