మనుషులు మరీ ఇంత దారుణంగా ఉంటారా? వాస్తవానికి ఏ మత గ్రంథం మైన ఒక వ్యక్తికి హాని తలపెట్టడం సరికాదని గట్టిగా చెబుతుంటాయి. హింస, ప్రతీకారం లాంటి గుణాలు ఉన్న మనుషులు దేవునికి ప్రీతిపాత్రులు కాదు. కానీ కొంతమంది బుద్ధి తక్కువ హీనులు తమని తాము పెద్ద భక్తులుగా చెప్పుకుంటూ... దేవుడి పేరు చెప్పి హత్యలు చేయడం, అమాయక ప్రజలకు హాని చేయడం లాంటివి చేస్తుంటారు. తాజాగా ఒక యువకుడు ఇలాంటి పనే చేసి కటకటాల వెనక్కి నెట్టబడ్డాడు.


వివరాలిలా ఉన్నాయి... మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకి చెందిన ఒక వ్యక్తి తాజాగా ఓ వీడియో ని టిక్ టాక్ లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలో తాను మాట్లాడుతూ... 'ఇది మీకు అల్లా వేస్తున్న శిక్ష' అంటూ దాదాపు పది రూ. 500 కరెన్సీ నోట్లతో తన ఉమ్మి, చీమిడి ని తుడుచుకున్నాడు. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతూ... 'వార్నీ, ఏంట్రా ఇదీ' అంటూ తెగ షేర్లు కామెంట్లు చేయడం ప్రారంభించారు. తర్వాత ఈ టిక్ టాక్ వీడియో అన్ని సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయబడింది. అయితే కొంతమంది ఈ వీడియో ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా... రంగంలోకి దిగిన నాశిక్ జిల్లా పోలీసులు వెంటనే ఆ యువకుడిని పట్టుకున్నారు.


ఆ వీడియో చూసిన పోలీసులు కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. రోజులో 24 గంటలూ కాపలా కాస్తూ కరోనా వ్యాప్తి ని కట్టడి చేస్తున్న పోలీసులకు ఇతను చేస్తున్న పని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు అని తెలుస్తోంది. కరోనా ప్రాణాంతక మహమ్మారి ని అందరికీ వ్యాప్తి చేయాలని తాను చేసిన ప్రయత్నం ప్రస్తుతం అందరినీ కలవరపెడుతోంది. కరెన్సీ నోట్లపై కరోనా వైరస్ దాదాపు ఆరు రోజుల పాటు బతికే ఉంటుంది. ఇది అందరి చేతులకి మారటం వలన వేల మందికి సోకే ప్రమాదం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ యువకుడు ఇంతకుముందు కూడా తన కరెన్సీ నోట్లకు ఉమ్ము చీమిడి రాసి కిరాణా షాపులలో ఇచ్చాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక మానవ బాంబు కంటే ప్రమాదకరమైన కరోనా వైరస్ ఇప్పటికే పది లక్షల మందిని పట్టిపీడిస్తోంది. ఇటువంటి ప్రాణాంతక మహమ్మారిని అంతమోదించాలంటే ప్రతి ఒక్కరి సాయం కావాలని ప్రధాన నరేంద్ర మోడీ అంటుంటే... కొంతమంది దేశద్రోహులు మాత్రం దేవుళ్ళ పేరు చెబుతూ అందరి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: