న్యూ ఢిల్లీలోని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. క‌రోనా వైర‌స్ చాప‌కింద నీ రులా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో దేశంలో తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మంత్రులు చ‌ర్చిస్తున్నారు. దేశంలో రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్చ‌లు, అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై మంత్రులంతా సమాలోచ‌న‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

 

 

ఈరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్ధేశించి వీడియో సందేశం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఈ రోజు ఉద‌యం నుంచి రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్‌, ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తున్నారు. దేశంలో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా నెల‌కొన్న తాజా ప‌రిస్థితుల‌పై చ‌ర్చిస్తున్నారు.  కాగా దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 2,543 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, 53 మంది క‌రోనా బారిన ప‌డి మృతిచెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: