కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తనదైన స్టైల్లో స్పందించారు. కరోనా బాధితులకు వైద్యం అందిస్తోన్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి రోగులపై కరోనా రోగుల బంధువులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరు చేసిన పనిని ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. చివరకు దీనిపై పెద్ద ఎత్తున విమర్శల నేపథ్యంలో డాక్టర్లపై దాడులు చేస్తోన్న వారిపై కేసులు కూడా నమోదు చేశారు.
ఈ క్రమంలోనే డాక్టర్లపై దాడి చేసిన వారిపై ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా రోగులకు వైద్యం చేస్తోన్న డాక్టర్లే చనిపోతున్నారని.. అలాంటి డాక్టర్లపైనే కరోనా రోగి దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. రోగులు అక్కడి నర్సులపై కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అసలు వారు మనుషులేనా అని రాజాసింగ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే శుక్రవారం డాక్టర్లపై దాడులు ఖండిస్తూ రాజా సింగ్ ఓ వీడియో కూడా రూపొందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలోనే డాక్టర్లు అందరికి దేవుళ్లుగా ఉన్నారని.. అలాంటి దేవుళ్లపై దాడులు ఎలా చేస్తారని.. ఇలా దాడులు చేసేవారిని నిర్దాక్షిణ్యంగా అడవిలోకి తీసుకెళ్లి అక్కడ వదిలేయాలని, కుక్కలు చచ్చినట్లుగా చనిపోతారని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రి డాక్టర్లపై దాడి చేసిన విషయంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు స్పందించడం లేదని కూడా ప్రశ్నించారు. ఈ దాడి చేసిన వారు ఎంపీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే అసద్ స్పందించడం లేదని రాజాసింగ్ విమర్శించారు. అలాగే ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారు స్వచ్చందంగా వచ్చి పరీక్షలు చేయించుకునేలా ఒవైసీ చెప్పాలని కూడా రాజాసింగ్ డిమాండ్ చేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple