ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం చేస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం డీఎస్పీ కొడుకుకి కరోనా పాజిటివ్ అని డాక్టర్స్ తేల్చి చెప్పిన విషయం అందరికి తెలిసినదే. దింతో డీస్పీ కుటుంబాన్ని గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. వారి కుమారుడికి కరోనా పాజిటివ్ కావడంతో అతనికి గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందజేస్తున్నారు. అయితే తాజాగా డీస్పీ కుటుంబంపై వస్తున్న వదంతులు వస్తున్నావని నిజం కావని అన్ని పుకార్లే అని డీస్పీ తనయుడు స్పష్టం చేశారు.

 

కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చిన డీస్పీ కుమారుడు వైద్యం పొందుతూ చనిపోయాడని వార్తలు రావడంతో అతను తన ఆవేదనను వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం వలన వారి కుటుంబ సభ్యులు, బంధువులు కంగారు పడుతారని తెలియజేశారు. 

 

 

అయితే తాజాగా డీఎస్పీ కుమారుడు వారిపై వస్తున్న వార్తలను ఖండిస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డీస్పీ కొడుకు మీడియా వారికి నా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి. నేను కొత్తగూడెం డీఎస్పీ కొడుకుని. శుక్రవారం మధ్యాహ్నం నేను మరణించానని వార్తలు వస్తున్నాయి. అవి ఏ మాత్రం నిజం కాదు. మా ఇంటిలో పనిచేసే ఆంటీని పోలీసులు వలవేసి పట్టుకున్నారని వారికీ నచ్చినట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు అది ఏ మాత్రం నిజం కాదని తెలిపారు.

 

మా నాన్న డీస్పీ కావడంతో వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కానీ, ఆకతాయితనంతో గాని తప్పుడు ప్రచారం చేస్తూ అందరికీ తెలియజేస్తున్నారు. వారు అలా చేయడంతో నేను స్పష్టత ఇస్తున్నా అని తెలిపారు. నేను బతికే ఉన్నాను. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తెలిపాడు. ఎంత ఇబ్బందికరమైనా గాని నేను స్వయంగా వీడియో చేసి మీ అందరికీ తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం అతను గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో కరోనా చికిత్స తీసుకుంటున్నాని ఓ వీడియోను విడుదల చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: