ఈ హత్యలకు ఫుల్ స్టాప్ లేక పోతోంది. సినిమా మాదిరి హత్యలు చేసి షాక్ తెప్పిస్తున్నారు. ఈ దారుణాలకు అంతు లేకుండా పోతోంది అనే చెప్పాలి. చిన్న చిన్న తగాదాలే అన్నింటికీ దారి తీస్తూ ప్రాణం మీదకి వస్తున్నాయి . అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది. ఎవరు హత్య చేసారు? ఎందుకు హత్య చెయ్య వలసిన పని వచ్చింది  ? వివరాల్లోకి వెళ్తే ....

 

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సమాజ్ పార్టీ నేత తో పాటుగా ముగ్గురు దారుణ హత్య కి గురి అయ్యారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న గొండా జిల్లాకి చెందిన ఎస్పీ నేత లాతి సింగ్ ని ఎవరో గుర్తు తెలియని దుండుగులు వచ్చి అతని మీద దాడి చేసారు. ఆతన్ని దుండుగులు ఘోరంగా కాల్చి చంపేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. 

 

 

అయితే ఈ ఎస్పీ నేత లాతి సింగ్ తో సహా మరో నలుగురిపై కూడా దుండుగులు కాల్పులు జరిపారు. దానితో  నేత లాతి సింగ్ తో సహా నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు పోలీసులు. అయితే ఈ ఘోరానికి పాల్పడిన నిందితులని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అసలు దీని అంతటికీ కారణం వారి మధ్య ఉన్న పాత కక్షలే అని నిర్ధారించారు .

 

 

ఈ కేసులో ఉన్న 11 మందిని పోలీసులు అదుపు లోకి తీసుకోవడమే కాక, కఠిన చర్యలు కూడా తీసుకోనున్నారు . ఈ విషయం తెలిసిన రాష్ట్ర ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాధ్ స్పoదించి బాధితులకి నాణ్యమైన చికిత్సని అందించాలని వైద్యులని కోరారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: