ప్రపంచంలో ఎంత పెద్ద వ్యాధి ఉన్నా సరే కొన్ని రోజులు వేధించినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడైనా తగ్గుతుంది. దానికి ఎలాగైనా కృషి చేసి ఎంతో మంది శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు మందును కనిపెడుతున్నారు. కాని అన్నిటికంటే పెద్ద రోగం కొంత మంది దుర్మర్గుల్లో ఉండే కామరోగాన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు. దాని కోసం ఎన్ని చట్టాలు, ఎన్ని శిక్షలు అమలులోకి వచ్చినప్పటికీ వాయి వరస.. చిన్నా పెద్దా.. మంచి చెడు ఇవేమి చూసుకోవడంలేదు. కేవలం వారి ఆలోచనంతా కామ వాంఛ తీర్చుకోవడం ఒక్కటే కనిపిస్తుంది. మైనర్ బాలికలను సైతం చెడగొట్టాలని చూస్తున్నారు. ఆఖరికి పసికందులను కూడా వదలడం లేదు ఈ కామాంధులు. కొన్ని విషయాలను చూస్తుంటే వీరిని ఏం చేయాలో కూడా అర్ధం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ సమాజంలో ఇలాంటి దారుణమైన ఘటనే ఒకటి విశాఖలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే...విశాఖ మన్యంలో దారుణ ఘటన 60 ఏళ్ల వృద్ధుడు మనవరాలి వయసున్న అభం శుభం తెలియని నాలుగేళ్ల పాప పై అత్యాచారానికి పాల్పడ్డాడు. హుకుంపేట మండలంలోని కొట్నాపల్లి పంచాయతీ దగ్గర గొందివలసకి చెందిన గెడ్డంగి కొండబాబుకి అరవైఏళ్ళు ఉంటాయి. ఆ ముసలాడి ఇంటి పక్కనే ఉండే నాలుగేళ్ళ బాలికకు మిఠాయి కొనిస్తానని నమ్మించి శుక్రవారం బయటకు తీసుకెళ్లాడు. ఇంటి వెనుకాలే ఉండే చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ఏం జరుగుతుందో కూడా అర్ధం కాక భయభ్రాంతులకు గురయింది.
కూతురు కనిపించకపోవడంతో ఆ చుట్టుపక్కల వెతుకుతున్న తల్లికి బాలిక ఏడుపు వినిపించింది. అంతే వెంటనే ఆమె అటువైపుకు వెళ్లి చూడగా రక్తస్రావంతో కూతురు కనిపించింది. విషయం అర్ధం చేసుకున్న తల్లి ఆగ్రహంతో వృద్ధుడిని చితకబాది ఆ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో హుకుంపేట ఎస్సై ఫిర్యాను తీసుకుని ఎంపీడీఓ ఇమ్మానుయేలు గొందివలస చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బాలికకు తాత వరుసవుతాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తాత, తండ్రిక, అన్న, తమ్ముడు ఇలాంటి వరుసలు ఏమీ ఉండడం లేదు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.