ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం లాక్ డౌన్ కఠినంగా అమలు చేసిన, విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు, ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన వారి వల్ల కరోనా కేసులు ఎక్కువయ్యాయి. అయితే ఓ వైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కష్టపడుతుంటే, ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాల్సిన ప్రతిపక్ష టీడీపీ నేతలు రోజూ ఏదొకరకంగా జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

 

హైదరాబాద్ లో ఉన్నాచంద్రబాబు, లోకేష్ లు లేఖలు, సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటు వైసీపీ నేతలు కూడా బాబు, టీడీపీ నేతలు చేసే విమర్శలని గట్టిగానే తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, టీడీపీ నేతలపై విమర్శలు చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.

 

తాజగా కూడా ఆయన  చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలని తిప్పికొట్టి, వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇక ఇదే సమయంలో విజయసాయి ఓ ఊహాగానమైన విమర్శ చేసారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కరోనా వచ్చి ఉంటే, వారు చేసే హడావిడి అంతాఇంతా ఉండేది కాదని అన్నారు.

 

పచ్చ మీడియాను వెంటేసుకుని క్వారంటైన్ వార్డుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడని,  డాక్టర్లను మందలించడం, తాను రాకపోతే పరిస్థితి ఏమిటని నిలదీయడాలు చేసేవారని ఎద్దేవా చేసారు. ఇక అది చూసి తమ్ముళ్లు ఇలాంటి సిఎం మాకు లేడే అని మహారాష్ట్ర, కేరళ ప్రజలు శోకాలు పెట్టినట్టు రచ్చ చేసేవారని అన్నారు.

 

ఇక విజయసాయి చేసిన కామెంట్లని బట్టి చూసుకుంటే, ఒకవేళ ఏడాది క్రితం వైరస్ వచ్చి ఉంటే, బాబు బ్యాచ్ హడావిడి అలాగే ఉండేదేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అసలు బాబు విజన్ తో కరోనా వ్యాప్తిని అడ్డుకునేవారని భజన చేసేవాళ్ళని అంటున్నారు. కరోనాని కూడా ప్రచారానికి వాడేసుకుంటారని, ఏదేమైనా విజయసాయి ఊహాగానం నిజమే అంటున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: