ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి రెచ్చిపోయింది. ఆదివారం ఉద‌యం తాజా అప్‌డేట్‌తో మొత్తం కేసులు 226కు చేరుకున్నాయి. గ‌త 12 గంట‌ల్లోనే ఏకంగా 34 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే నెల్లూరు జిల్లాలో 34 కేసులు ఉండ‌గా... గుంటూరు 30 కేసులు ఉండ‌గా.. కృష్ణా జిల్లాలో 28 కేసులు న‌మోదు అయ్యాయి. క‌డ‌ప 23, ప్ర‌కాశం 19, విశాఖ జిల్లాలో 15 కేసులు ఉన్నాయి. అలాగే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనూ 15 కేసులు ఉండ‌గా... తూర్పుగోదావ‌రి జిల్లాలో 11 కేసులు.. చిత్తూరు జిల్లాలో 10 కేసులు ఉన్నాయి.

 

ఇక నెల్లూరు జిల్లా అయితే క‌రోనా హ‌బ్‌గా మారిపోతోంది. ఏపీలోనే ఇక్క‌డ ఎక్కువ మంది క‌రోనా బాధితులు ఉన్నారు. ఇక క‌ర్నూలు జిల్లాలోనూ ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇక ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారి నుంచే అన్ని జిల్లాల్లోనూ క‌రోనా కేసులు స్వైర‌విహారం చేస్తున్నాయి. ఇప్ప‌టికే అధికారికంగా 226కు ఈ కేసులు చేరుకోగా.. అన‌ధికారికంగా చూస్తే ఈ కేసులు వంద‌ల్లోనే ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక రాజ‌ధాని ప్రాంతం నుంచి కూడా ఢిల్లీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారు ఎక్కువుగా ఉండ‌డంతో ఇక్క‌డ కూడా కేసులు ఎక్కువే ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: