తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ దీప య‌జ్ఞం లో భాగంగా దీప ప్ర‌జ్వ‌ల‌న చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను ఇప్ప‌టికే ప్ర‌గ‌తి భ‌వ‌న్ అధికారులు పూర్తిచేశారు.  ఆదివారం రాత్రి నిర్వ‌హించ‌నున్న  ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన‌నున్నారు. ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేయాల‌ని సెల‌బ్రెటీలు, సినీ హీరోలు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించారు.  కాగా ఈ స‌మీక్ష స‌మావేశంలో లాక్ డౌన్ అమ‌లు కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లు , జాగ్ర‌త్త‌ల‌పై సీఎం కేసీఆర్ అధికారుల‌కు దిశానిర్ధేశం చేయ‌నున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి చేప‌డుతున్న చ‌ర్య‌ల‌పై  ఉన్న‌త స్థాయి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: