భారతదేశంలో తన దాడిని కొనసాగిస్తున్న కారోనా వైరస్ సోకిన వారు కొద్దిగా పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే కరోనా వల్ల భారతదేశంలో 75 మంది ప్రాణాలు కోల్పోగా వైరస్ వయసు వారికి విపరీతంగా వ్యాపిస్తుందో ప్రభుత్వం ఒక విశ్లేషణ జరిపి ప్రకటించింది. వైరస్ బారిన పడిన భారతీయుల్లో ఎక్కువమంది 21 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నారని భారత ప్రభుత్వం వెల్లడించింది. అలాగే మొదటిసారిగా కరోనా బాధితుల వయసు వివరాలను విడుదల చేసింది.

 

శనివారం ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 2902 మందికి కరోనా పాజిటివ్ లు ఉండగా వారిలో 68 మంది మృతి చెందారు. వారిలో 184 మంది కొలుకోగా మొత్తం వైరస్ సోకిన వారి వివరాలను వయసుల వారీగా వెల్లడించారు. 21 నుండి 40 వయస్సు మధ్య ఉన్న వారు 1,213 మంది ఉండగా 41 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు 951 మంది ఉన్నారు.

 

60 ఏళ్లకు పైబడిన వారు 484 మంది ఉండగా వైరస్ సోకిన వారిలో ఇప్పుడు 58 మంది పరిస్థితి విషమంగా ఉంది. విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెబుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపోతే వీరిలో ఢిల్లీ మధ్యప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నారట.

 

అయితే మృతుల్లో అధికంగా వృద్ధులు ఉన్నారు. మరణాలు సంభవించడానికి కారణం వృద్ధులు హై బీపీ - డయాబెటీస్ - కిడ్నీ - గుండె సంబంధ అనారోగ్య సమస్యలతో ఉండడంతో వారికి కరోనా సోకి వారి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు. అందుకే కరోనా వైరస్ వేగంగా వృద్ధులకు వ్యాప్తి చెంది వారు మృతి చెందుతున్నారని పేర్కొంటున్నారు.

 

అంటే మీ వయస్సు 20 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే మీకు వైరస్ సోకే అవకాశాలు తక్కువ ఉన్నట్లే. మిగతా వారు కానీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక వాళ్ళకి కూడా ఇది సోకే అవకాశాలు తక్కువ కాని వస్తే మాత్రం పెద్ద రిస్క్. ఇక యువకులు, మధ్యవయస్కులకు ఈ వైరస్ ఊరికే సోకుతుంది అన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: