ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు అందరూ కూడా తమ తమ ఇళ్ళల్లో దీపాలను వెలిగించారు. ప్రజలతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ప్రధాని ఇచ్చిన పిలుపుతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకి వచ్చి దీపాలు వెలిగించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రధాని ఇచ్చిన పిలుపుతో అందరూ ముందుకి వచ్చి దీపాలు వెలిగించారు. 

 

గో కరోనా అంటూ యావత్ భారతావని దీపాల వెలుగులో మెరిసిపోయింది. ప్రజలు అందరూ స్వచ్చందంగా ముందుకి వచ్చారు. ఇక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్ లో కొవ్వొత్తి వెలిగించారు. ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ముందుకి వచ్చి దీపాలు వెలిగించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. 

 

ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రులు అందరూ కూడా దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్వచ్చందంగా తన కుమారుడు నారా లోకేష్ తో కలిసి దీపాలు వెలిగించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన దీపం వెలిగించారు. జగన్ కూడా తాడేపల్లి లోని తన క్యాంప్ ఆఫీస్ లో కొవ్వొత్తి వెలిగించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే కూడా మాతో శ్రీలో దీపం వెలిగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: