ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తోన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాల్సిందే. ఈ రోజు కరోనా వ్యాధి సోకిన వారికి వైద్యం చేస్తోన్న డాక్టర్లు సైతం చనిపోతున్నారంటే కరోనా మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తోన్న వారికి... ఇందుకు సేవలు అందిస్తోన్న వారికి సపోర్ట్గా ఇప్పటికే మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చారు. ఆ కర్ఫ్యూ సూపర్ సక్సెస్ అయ్యింది.
ఇక 5వ తేదీ ఆదివారం ప్రజలు అందరూ రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేసి దీపపు జ్యోతులు 9 నిమిషాలు పాటు వెలిగించాలని పిలుపు ఇచ్చారు. మోదీ పిలుపుతో యావత్ 130 కోట్ల మంది భారతీయులు జ్యోతులు వెలిగించి మనదేశ ఐక్యత చాటారు. ఎంతో మంది సెలబ్రిటీలు సైతం జ్యోతులు వెలిగించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కుటుంబం కూడా దీపపు జ్యోతులు వెలిగించిన ఫొటో సోషల్ మీడిమాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో నాగార్జున, అమలతో పాటు వారి రెండో కుమారుడు అఖిల్ ఇంట్లో బయట లైట్లు ఆర్పేసి.. కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉన్నారు. పక్కనే మరో ముసలావిడ కూడా ఉన్నారు. నాగచైతన్య - సమంత జంట ఈ ఫొటోలో లేకపోవడంతో వారు బయట ఉన్నారని అర్థమవుతోంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple