కరోనా నియంత్రణ పై ప్రభుత్వం ఎన్నో చట్టాల ను తీసుకొస్తున్నారు. ప్రజలను గడ గడ లాడిస్తున్న ఈ మహమ్మారి పూర్తి గా ప్రార ద్రోలాలి అనే ఉద్దేశ్యం తో మోడీ జనతా కర్ఫ్యూ విధించారు. అంతే కాకుండా ఇందు లో భాగం గా లాక్ డౌన్ ను ప్రకటించారు. ఈ మేరకు ప్రజలు ఇళ్లకే పరిమవుతున్నారు. ప్రజలను ఆదుకోవడాని కి సినీ రాజకీయ ప్రముఖులు ముందు కొస్తున్నారు. 

 

 


అయితే లాక్ డౌన్ కారణం గా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.ఎక్కడిక్కడ అన్నీ బంద్ అయినా సంగతి విదితమే. 

 

 

 

అసలు విషయానికొస్తే.. లాక్ డౌన్ పుణ్యామా అని ప్రకృతిలో కాలుష్యం తగ్గింది. పరిశ్రమలు మూతపడటం... రోడ్లపైకి వాహనాలు కూడా  రాకపోవడంతో ఇప్పటికే దేశంలోని 90 కి పైగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. అలానే గంగా నదిలో కూడా నీటి నాణ్యత మెరుగుపడినట్లు పరిశోధనలు తెలిపాయి. కరోనా ను  ప్రారద్రోలాలని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. 

 

 


రాత్రి తొమ్మిది గంటలకు అందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి దీపాలను లైట్లను వెలిగించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు 9 నిమిషాల పాటు హైదరాబాద్ మొత్తం దీపావళిని మరిపించేలా కాంతులతో రోడ్ల మీదకు వచ్చి ప్రజలు సంబరాలు చేస్తున్నారు.. పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసిన కూడా దీపాల వెలుగులో విరాజిల్లుతున్నాయి. కరోనా భయాన్ని 9 నిమిషాల పాటు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: