ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హాయిగా గడిచిపోతున్న జీవితంలోకి మూడో వ్యక్తి రావడం. భార్య లేదా భర్త మూడో వ్యక్తి మోజులో పడి కట్టుకున్న వాళ్లని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నించడం... గుట్టుచప్పుడు కాకుండా మూడో వ్యక్తి తో అక్రమ సంబంధాన్ని కొనసాగించడం లాంటి ఘటనలు ఈ రోజుల్లో చాలానే తెరమీదకు వస్తున్నాయి. ఇలా రోజు రోజురోజుకు తెర మీదకి వస్తున్న అక్రమ సంబంధాలు హత్యలు ఆత్మహత్యలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. పెళ్లై ఏడాది కూడా తిరగకుండానే భార్య ఆత్మహత్య చేసుకున్న చనిపోయిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది.
భర్తకి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలిసిన మహిళ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది. అంతేకాకుండా భర్త తన జీతాన్ని తన ప్రియురాలికి ఇస్తుండడంతో అవమానంగా ఫీలై మనస్థాపానికి గురై చివరికి ప్రాణాలు తీసుకుంది సదరు మహిళ. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గుజరాత్ రాజధాని అయిన అహ్మదాబాద్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్ పరిధిలోని నారోల్ లో బీహార్కు చెందిన రోషన్ సింగ్ రాజ్ పుత్ కి అదే ప్రాంతానికి చెందిన బబ్లీ కుమారి రాజ్ పుత్ తో వివాహం జరిగింది. ప్రజల సమస్యలు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
భర్త రోషన్ ఒక కంపెనీలో ఫైర్ మెన్ గా పని చేస్తుండగా బబ్లీ కుమారి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే కొద్దికాలం పాటు కాపురం హాయిగా సాఫీగా సాగిపోయింది. కానీ కొన్నాళ్ళకి వీరి కాపురంలో కలహాలు రేగటం మొదలయ్యాయి . తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న భార్య తరచూ భర్తతో గొడవ పడేది. ఇక తన భర్త సగం జీవితాన్ని ప్రియురాలు ఇస్తున్నారని తెలిసి మరింత మనస్తాపానికి గురైంది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. దీంతో తన జీవితం నాశనం అయిందని మనస్థాపం చెందిన సదరు మహిళ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు మన్మోహన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్క మరణానికి తన అక్క భర్తే కారణమంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..