దేశంలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న తప్పులే కారణమని వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధి రెండు నెలల నుంచి దేశంలో కరోనా గురించి అనేక హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. అయినా సరే అంతర్జాతీయ విమానాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం కాలేదు. దీనితోనే కేసులు పెరుగుతున్నాయి.
ఇక ఢిల్లీ లో జరిగిన మత ప్రార్ధనలకు సంబంధించిన సమాచారం కూడా ముందు నుంచి కేంద్రం సంపాదించి ఉంటే నేడు పరిస్థితి ఈ స్థాయిలో ఉండేది కాదు అనేది వాస్తవం. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రాలకు మోడీ సర్కార్ చేస్తున్న సాయం అంటూ ప్రత్యేకంగా ఏమీ కనపడటం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఇప్పుడు విపక్షాలు దీని మీద ఆరోపణలు చేస్తుంటే పదే పదే విమర్శలు చేయడం దేశ ద్రోహులు అనడం బిజెపి అలవాటు చేసుకుంది.
దేశ వ్యాప్తంగా పరిస్థితులు చాలా దారుణంగా ఉండటానికి మోడీ సర్కార్ అలసత్వం కారణం. ఇప్పుడు మన దేశంలో విపక్షాలు వాస్తవాలు మాట్లాడినా సరే ప్రజలు పాపం వాళ్ళను దేశ ద్రోహులుగా చూసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకే విపక్షాలు మాట్లాడే పరిస్థితిలో లేవు. దేశంలో కొవ్వొత్తులు వెలిగించడం వెనుక అర్ధం ఏంటి అనేది ఎవరికి తెలియడం లేదు. ప్రపంచ దేశాలు ఇలా చేసి ఉంటే ఎప్పుడో కరోనా వాళ్ళ వరకు వచ్చి ఉండేది కాదు కదా...?
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNappl