మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడ ఫలితం మాత్రం దక్కడం లేదు. రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతునే  ఉన్నాయి. అత్యాచారం చేసి నిందితులను శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు వచ్చినప్పటికీ.. నిందితులను ఉరి శిక్షలు  ఎన్కౌంటర్లు లాంటి చేస్తూ కఠినంగా శిక్షలు వేసి ఉన్నప్పటికీ వారిలో భయం మాత్రం కనిపించడం లేదు. దీంతో మహిళలు ప్రశ్నార్ధక జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. అభం శుభం తెలియని చిన్నారులు నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు. ముఖ్యంగా కామంతో కళ్లు మూసుకుపోయి వావివరుసలు మరచి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ రోజుల్లో చాలా తెరమీదకు వస్తున్నాయి. ఇక తాజాగా ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 మేనమామ కూతురు పై కన్నేసిన కామాంధుడు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్లోని నలంద జిల్లాకు చెందిన జిత్తు.. నోయిడా పరిధిలోని సోలార్ పూర్ లో తన మేనమామ ఇంటికి సమీపంలోనే నివాసం ఉండేవాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన యువకుడు ఎనిమిదేళ్ల మేనమామ కూతురు పై కన్నేశాడు. ఇక ఎలాగైనా పశువాంచ తీర్చుకోవాలని భావించి  సరైన సమయం కోసం వేచి చూశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలికపై అతి దారుణంగా అత్యాచారానికి తెగబడ్డాడు. 

 

 

 ఇక ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడడంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. దీంతో తమ కూతురిపై అత్యాచారానికి గురైనట్లు కుటుంబసభ్యులు గుర్తించి... సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం అయిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. మంచి వాడిలా ప్రవర్తిస్తూ సమయం కోసం ఎదురు చూసి  తమ కూతురి పై పశువాంచ తీర్చుకుని చంపిన  సదరు యువకుడు పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పోక్సో చట్టం లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: