ఇండియాలో కరోనా వైరస్ ఇంతలా వ్యాపించడానికి కారణమైన ఒకే ఒక్క, అతిపెద్ద సోర్స్ గా నిలిచిన న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్, మర్కజ్ ప్రాంతంలోని తబ్లిగీ జమాత్ కు విదేశాల నుంచి వచ్చి, ఆపై చెప్పాపెట్టకుండా దేశం విడిచి వెళ్లాలని భావించిన అందరిపైనా పోలీసుల చర్యలు మొదలయ్యాయి.  గత నెల న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్, మర్కజ్ ప్రాంతంలోని జరిగిన ప్రార్థనా కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా విస్తరిస్తుందని అంటున్నారు.  ఈ నేపథ్యంలో బార్డర్ లో సైతం వీరిపై నిఘా ఉంచారు.

 

తాజాగా మసీదులో దాక్కున్న 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులను సైనికులే పోలీసులకు పట్టించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కంటోన్మెంటులో వెలుగుచూసింది. లక్నోలోని ఆర్మీ కంటోన్మెంటులోని సదర్ బజార్ అలీజాన్ మసీదులో కరోనా వైరస్ లక్షణాలతో 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులు దాక్కున్నారని లక్నో మిలటరీ ఇంటలిజెన్స్ కు సమాచారం వచ్చింది.  

 

మిలటరీ అధికారులు వెంటనే లక్నో పోలీసు కమిషనరుకు సమాచారం అందించి వారితో కలిసి మసీదుపై దాడి చేయగా, లోపల సహారాన్ పూర్ నగరానికి చెందిన 12 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులు దాక్కున్నారని మిలటరీ, పోలీసులు గుర్తించారు. వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా లక్షణాలున్నా వారు మసీదులో దాక్కున్నారని దర్యాప్తులో తేలింది. దీంతో వారి నమూనాలను సేకరించి పరీక్షకు పంపించి వారందరినీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: