ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా రోజు రోజుకు స్వైర‌విహారం చేస్తోంది. తాజాగా రిలీజ్ అయిన బులిటెన్‌లో చూస్తే ఏపీలో క‌రోనా కేసులు ఏకంగా 266కు చేరుకున్నాయి. తాజాగా ఏపీలో సోమ‌వారం ఉద‌యం 14 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. కొత్త‌గా విశాఖప‌ట్నంలో ఐదు, అనంత‌పురం జిల్లాలో మూడు, క‌ర్నూలులో మూడు, గుంటూరులో రెండు కేసులు న‌మోదు అయ్యాయి.

 

ప్ర‌ధానంగా ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారి నుంచే ఈ కేసులు వ‌స్తున్నాయి. అలాగే అనంత‌పురం, మ‌చిలీపట్నంలో క‌రోనాతో ఇద్ద‌రు  వ్య‌క్తులు మృతి చెందారు. ఏపీలో ఇప్ప‌టికే ఓ వ్య‌క్తి క‌రోనాతో మృతి చెంద‌గా తాజాగా ఈ రెండు మ‌ర‌ణాల‌తో క‌లుపుకుంటే క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: