టాలీవుడ్ లో మెగా అభిమానులతో పాటుగా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా పవన్ కళ్యాణ్, చిరంజీవి మల్టీ స్టారర్. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కళా బంధు సుబ్బిరామి రెడ్డిసినిమా గురించి ప్రకటన కూడా చేసారు. అయినా సరే ఆ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ముందుకి అడుగు పడలేదు. 

 

సినిమా కోసం చిరంజీవి ఒక సినిమాను కూడా వద్దనుకున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇది పక్కన పెడితే... ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి కీలక అడుగు పడినట్టు సమాచారం. ఈ సినిమా కథను ఒక ప్రముఖ దర్శకుడు రెడీ చేస్తున్నాడని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాల మాట. సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని సమాచారం. 

 

ఈ సినిమాలో చిరంజీవి ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా ఆయన అల్లుడిగా పవన్ కళ్యాణ్ నటించే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇది ఎంత వరకు నిజం అనేది ఇంకా స్పష్టత లేదు. ఇక నిర్మాతగా సుబ్బిరామి రెడ్డి తో పాటుగా రామ్ చరణ్ కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కాజల్ మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఉంటారని టాక్. సినిమా కథ కూడా దాదాపుగా రెడీ అయింది అంటున్నారు. చూద్దాం నిజమో కాదో.

మరింత సమాచారం తెలుసుకోండి: