టాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. వరుసగా సినిమాలు చేయడమే కాదు ఇతర సినిమాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. చిన్న హీరోల సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టే ఆలోచనలు చేస్తున్నారు. గతంలో హీరోయిన్ లు అప్పుడు అప్పుడు నిర్మాతలు అయ్యే వాళ్ళు. ఇప్పుడు నిర్మాతలు గా మారడానికి చాలా మంది హీరోయిన్ లు ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మంధనా అదే పనిలో ఉంది. 

 

ఇక పూజ హెగ్డే సహా కొందరు హీరోయిన్లు ఎక్కువగా కష్టపడుతున్నారు. నిర్మాతలు గా మారడానికి చిన్న చిన్న హీరోలను ఎంపిక చేసుకుని కథలు సిద్దం చేయించాలని తమ సన్నిహితులకు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కీర్తి సురేష్ కూడా నిర్మాతగా మారడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది అనేది టాలీవుడ్ జనాల మాట. ఆమె శర్వానంద హీరోగా ఒక సినిమా చేయడానికి గానూ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి తీసుకుని వెళ్ళే ఆలోచన చేస్తుంది. 

 

ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రముఖ దర్శకుడి తో కూడా ఆమె మాట్లాడినట్టు సమాచారం. ఇది ఎంత వరకు నిజమో గాని ఆమె శర్వానంద తో కూడా మాట్లాడింది అనేది టాక్. అందుకు శర్వా కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఆమె ఈ సినిమా చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ గా కూడా తానే నటించాలి అని భావిస్తున్నారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని కీర్తి మాత్రం రెడీ గా ఉంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: