మ‌న‌దేశంలో క‌రోనా గంట గంట‌కు కౌంట్ పెంచుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా సోమ‌వారం మ‌ధ్యాహ్నం అప్‌డేట్ చూస్తే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు 13 ల‌క్ష‌లు దాటేశాయి. క‌రోనా మ‌ర‌ణాలు 70 వేలు దాటేశాయి. క‌రోనా రిక‌వ‌రీ కేసులు 2, 71, 721 కేసులు ఉన్నాయి. ఇక మ‌న దేశంలో చూస్తే సోమ‌వారం మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన బులిటెన్ ప్ర‌కారం క‌రోనా పాజిటివ్ కేసులు 4067 గా ఉన్నాయి. ఇక ఈ అప్‌డేట్‌ను బ‌ట్టి చూస్తే క‌రోనా గంట గంట‌కు కౌంట్ పెరుగుతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

 

ఇక మ‌న‌దేశంలో క‌రోనా మ‌ర‌ణాల్లో 23 శాతం మంది మ‌హిళ‌లు ఉన్నారు. ఇక క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 118 మంది మృతిచెందారు. అయితే అధికారికంగా ఈ లెక్క 109 మాత్ర‌మే అని చెపుతున్నారు. వీరిలో దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ‌కు ప్ర‌ధాన కార‌ణ‌మైన జ‌మాత్ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల బాధితులే ఉన్నారు. వీరి సంఖ్య ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 1445గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. 
 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: