కరోనా వైరస్పై కొందరు ఇష్టమొచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని. ఇది తగదని కేసీఆర్ ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం ప్రెస్మీట్ పెట్టిన ఆయన ప్రధాని ఇచ్చిన సంఘీభావ సంకేతాన్ని సైతం కొందరు అవమానిస్తున్నారని.. ఇది తగదని చెప్పారు. ప్రస్తుతం మానవ జాతి అందరూ ఎంతో విపత్తులో ఉంటారని కొందరు కరోనాపై లేనిపోని రాతలు రాయడం తగదన్నారు. ఇక కొందరు చిల్లర గాళ్లు మోదీని సైతం టార్గెట్గా చేసుకుని ఎందుకు వెకిలి పోస్టులు పెడతారని విమర్శించారు.
ఎవరో చిల్లర గాళ్లు చేసే పిచ్చి ప్రచారాలు నమ్మవద్దని.. ఇక కొన్ని పత్రికలు సైతం తెలిసి తెలియక పిచ్చి రాతలు రాస్తున్నారని.. ఇటీవల ఒక పత్రిక వైద్యులకు రక్షణ ఏదని రాసిందని.. వాళ్లకు అసలు నిజాలు తెలుసా ? అని ప్రశ్నించారు. పీపీఏ కిట్లు లేవని రాసిందని.. మా దగ్గర ఈ కిట్లు ఏకంగా 40 వేలు ఉన్నాయని... ఈ విషయం మీకు తెలుసా... ? అని విమర్శించారు. మీ లాంటి పత్రికల వాళ్లు దేశానికి పనికి వస్తారా ? అని విమర్శించారు. ఇలాంటి పత్రికలకు త్వరలోనే శిక్ష తప్పదని.. మీరు ఈ టైంలో ప్రజల్లో ధైర్యం కల్పించాల్సింది పోయి చెత్త.. పనికి మాలిన వార్తలు ఎందుకు రాస్తారని ప్రశ్నించారు. ఇప్పటకి అయినా ఈ వక్ర బుద్ధి ఉన్న వాళ్లు మంచి బుద్ధితో మారాలని కోరుకుంటున్నానని అన్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
https://tinyurl.com/NIHWNgoogle