ప్రపంచాన్ని ఇప్పడు ఒకే ఒక సమస్య పట్టి పీడిస్తుంది. అదే భయంకరమైన కరోనా భూతం. దేశంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా ని కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు తగు రీతిన స్పందిస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు. ఆ మద్య జనతా కర్ఫ్యూ దిగ్విజయంగా ముగిసింది. నిన్ని రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు దిపాలను వెలిగించి సంఘీభావం ప్రకటించారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ లో కరోనా పరిస్థితి గురించి వివరించారు.
ఈ నేపథ్యంలో కొంత మంది ప్రధాని పిలుపునిస్తే దానిపై వెకిలి జోకులు వేస్తున్నారు... ప్రధాని సంఘీభావ సంకేతంగా దీపాలు వెలిగించాలన్నారు.. ప్రధాని సూచనలు సలహాలు బరాబర్ర్ పాటిస్తామని అన్నారు. వైద్య సిబ్బందికి చేతులెత్తి దండం పెడుతున్నా.. కష్టకాలంలో మీరు చేస్తున్న సేవలు ఎవ్వరూ మర్చిపోరు అన్నారు. స్వీపర్ నుంచి హెల్త్ డైరెక్టర్ వరకు పాదాభివంనం చేస్తున్నా.. గాంధీలో 308 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇంకా 100 మంది బాధితులు రావొచ్చు.. అంతటితో కరోనా అగిపోవొచ్చు అని భావిస్తున్నా అన్నారు. తర్వాత స్టేజ్ కు ట్రాన్స్ మీట్ అయితే మన చేతుల్లో ఉండదని అన్నారు. బోస్టన్ సర్వే వారు జూన్ 3 వరకు లాక్ డౌన్ చేయాలన్నారు. లాక్ డౌన్ రోజుల్లో రూ.6 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. తెలంగాణ రూ.2500 కోట్ల ఆదాయం కోల్పోయింది.. ఇది పెద్ద దెబ్బ అన్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple