దేశంలో కరోనా వైరస్ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయినా.. వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి అంతానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను రూపొందించింది. వైరస్ తీవ్రంగా వ్యాపించిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో నిలిచిపోయే వరకూ మరింత కఠినంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు *అగ్రెసివ్ కంటైన్మెంట్ స్ట్రాటజీ*తో 20 పేజీల డాక్యుమెంట్ ను కేంద్ర ప్రభుత్వం సిద్దం చేసి కార్యాచరణలోకి తీసుకొస్తోంది. కొవిడ్-19కు హాట్ స్పాట్లు గా మారిన ప్రాంతాల్లో నెల రోజుల పాటు ఆంక్షలు కొనసాగించేదిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అనేక రాష్ట్రాల్లో పలు చోట్ల కరోనా వైరస్ కస్ల్టర్లు ఏర్పడ్డాయని, వీటి వల్ల చాలా ముప్పు పొంచి ఉందని గుర్తించిన కేంద్రం ఈ మేరకు కార్యాచరణ కొనసాగించనుంది.
ఈ క్రమంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం 96 జిల్లాలను కరోనా రెడ్జోన్లలో చేర్చిన విషయం తెలిసిందే. ఇక వైరస్ క్లస్టర్ల ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించాలని కేంద్రం భావిస్తున్నది. వైరస్ క్ల స్టర్లు గా మారిన ప్రాంతాల్లో4 వారాల పాటు ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకుండా ఆగిపోయేంత వరకూ అత్యంట కఠినంగా ఉండాలని అగ్రెసివ్ కంటైన్మెంట్ స్ట్రాటజీ డాక్యమెంట్లో కేంద్రం పేర్కొన్నది. అంతేగాకుండా.. దీనిని హెల్త్ మినిస్ట్రీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. కరోనా వైరస్ కూడా హెచ్1ఎన్1 ఇన్ ఫ్లుయెంజా మాదిరిగా దేశంలోని కొన్నిప్రాంతా ల్లోనే ఎక్కువగా వ్యాపిస్తోందనే అంచనాకు వచ్చింది. అందుకే హాట్ స్పాట్లు , ఆయా ప్రాంతాలకు తగిన ట్లుగా వేర్వేరు వ్యూహాలతో దీనిని అంతం చేయాలని నిర్ణయించింది. అంటే.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్వారంటైన్లు, ఆస్పత్రులు ఏర్పాటు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.