ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా మన దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఐదువేలకు చేరువలో ఉన్నాయి. ఇక వరల్డ్ మీటర్ ప్రకారం చూసినా మనదేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాలు 136 వరకు ఉన్నాయి. గంట గంటకు కేసులు పెరిగిపోతున్నాయి. ఇక మర్కజ్ కేసుల నేపథ్యంలోనే కరోనా కేసుల తీవ్రత గత వారం రోజుల్లో బాగా ఎక్కువ అయ్యింది. ఈ క్రమంలోనే భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో కరోనా కట్టడికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ మెడికల్ కీలక నిర్ణయం తీసుకుంటుంది.
రోజుకి లక్ష మందికి పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇక దేశంలో ఏ ప్రాంతాల్లో అయితే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా వస్తున్నాయో ? ఎక్కడ అయితే హాట్స్పాట్ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయో ? అక్కడ ఎక్కువుగా కరోనా పరీక్షలు చేయడంతో పాటు ప్రతి రోజు సర్వేలు చేయాలని.. అనుమానితులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని రీసెర్స్ మెడికల్ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేట్కు చెందిన ల్యాబ్స్ను, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్స్, మెడికల్ కాలేజీలను గుర్తించి అక్కడ పరీక్షలు చేయనున్నారు. ఇక 24 గంటలు కూడా పరీక్షలు నిర్వహించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ : NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. |
|
|