తాజాగా భారత దేశ అతిపెద్ద బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు తగు సూచనలు సూచించింది. కొత్త సైబర్ నేరగాళ్ల చేతిలోకి మీ అకౌంట్ ఇవ్వదని sbi కస్టమర్లకు తెలిపింది. కొందరు మోసగాళ్లు కస్టమర్లకు ఫోన్ చేసి లోన్, EMI పోస్ట్ ఫోన్ చేసుకోవాలని అనుకుంటున్నారా...? అని అడిగి OTP చెప్పమని అడుగుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లకు తెలియచేయడం జరిగింది.
Cyber fraudsters keep finding new ways to scam people. The only way to beat the #cybercriminals is to #BeAlert & be aware. Please note that EMI Deferment does not require OTP sharing. Do not share your OTP. For details on EMI Deferment scheme, visit: https://t.co/wP3Xux99vI#SBI pic.twitter.com/2GZSHX3ONa
— State bank of india (@TheOfficialSBI) April 5, 2020
అంతే కాకుండా EMI మారటోరియం ఫెసిలిటీకి ఎలాంటి EMI అవసరం లేదని తెలిపింది SBI. మీరు ఎవ్వరికీ ఓటీపీని తెలియ చేయవద్దు అని sbi ట్విట్టర్ ద్వారా కస్టమర్లకు తెలిపింది. ఒకవేళ మీరు OTP షేర్ చేస్తే మాత్రం.. మోసగాళ్లు మాత్రం మీ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారని sbi హెచ్చరించింది. సైబర్ మోసగాళ్లు ప్రజల నుంచి డబ్బులు కొట్టేయడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే వారి నుంచి తప్పించుకోవడానికి మనకు ఉన్న ఒకే ఒక్క మార్గం.
సైబర్ నేరగాళ్లకు చేతికి చిక్కకుండా ఉండాలంటే, 3 నెలల EMI మారటోరియం ఆప్షన్ ఎంచుకోవడానికి ఎలాంటి ఓటీపీ అవసరం లేదు. " మీ OTP ని ఎవ్వరికీ షేర్ చేయవద్దు అలాగని చెప్పొద్దు కూడా. EMI మారటోరియం గురించి తెలుసుకోవడానికి sbi బ్యాంక్ వెబ్ సైట్ను చూడండి" అని sbi తెలిపింది. ఇకపోతే కరోనా లాక్ డౌన్ వల్ల RBI బ్యాంక్ కస్టమర్లకు 3 నెలల EMI మారటోరియం ఆప్షన్ ని ఇచ్చింది.
ఈ ఆప్షన్ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు చెందిన టర్మ్ లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు బకాయిలకు కూడా ఈ ఫెసిలిటీ కలిగి ఉంది. దీనితో ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే నెలల EMI లు కట్టక్కర్లేదు. కాకపోతే దీనికి ముందుగా మీ బ్యాంక్ నుంచి మీకు అనుమతి కచ్చితంగా ఉండాలి. ఇకపోతే RBI ప్రకారం చాలా బ్యాంకులు వారి కస్టమర్లకు ఈ ఆప్షన్ అందిస్తున్నాయి.