కరోనా ఇప్పుడు ఈ పేరు వింటే ఎంతటి ధైర్యవంతులకైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇప్పుడు భయం గుప్పట్లో బతికేలా చేసింది. అయితే ఈ కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.. అందుకే ఇంటి పట్టున ఉండాలని లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి కట్టడి చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారింది. ఓ వ్యక్తికి కరోనా సోకినప్పుడు ఆ వైరస్ తాలూకు లక్షణాలు బయటపడేసరికి 14 రోజుల సమయం పడుతుంది.
ఈ లోపే ఆ వ్యక్తి మరికొందరికి వైరస్ అంటించే అవకాశాలు ఉండడంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఓ అధ్యయనం చేసింది. ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా సమాజంలో తిరిగినట్టయితే 30 రోజుల్లో 406 మందికి వ్యాధి సంక్రమింపచేయగలడని ఆ అధ్యయనంలో పేర్కొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ అధ్యయనం గురించి మీడియా సమావేశంలో వెల్లడించారు.
దీన్ని వైద్య పరిభాషలో 'ఆర్ నాట్' (R0) గా భావిస్తారు. అయితే, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోగలిగితే ఆ వ్యక్తి ఇతరులకు వైరస్ అంటించే శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. కరోనా రోగి సామాజిక సంచారాన్ని 75 శాతానికి పరిమితం చేయగలిగితే వ్యాధి సంక్రమణం కూడా అదే స్థాయిలో తగ్గిపోతుందని ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అన్ని పరిగణలోకి తీసుకొని లాక్ డౌన్ 21 రోజులు విధించారని ఆయన తెలిపారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple