రోజులు మారుతున్న నేపథ్యం లో మనుషుల మధ్య వావి వరుసలు కూడా మారిపోతున్నాయి. ఎక్కడ చుసిన అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి. క్షణకాలం సుఖం కోసం కక్క్రుతి పడటమే కాకుండా అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ మహిళ తన కంటే 22ఏళ్లు చిన్నవాడైన యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన సుఖానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది. 

 

 

 


ఆమెకు మరొకరితో వివాహము చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా శారీక సుఖం కోసం మరో అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తనకన్నా 20 ఏళ్ల చిన్నవాడితో  గత కొంతకాలంగా చాటు మాటు వ్యవహారాన్ని కొనసాగిస్తుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ఆ కుర్రాడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు కొనసాగించేది. కొద్దిరోజుల పాటు సాఫీగా సాగిన వీరి బాగోతం రోహిత్‌కు తెలిసిపోయింది. 

 

 

 


దీంతో పద్ధతిగా ఉండాలని భార్యను హెచ్చరించాడు. దీంతో తన బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. శనివారం అందరూ ఇంట్లో నిద్రపోతుండగా లక్ష్మి ప్రియుడు లోనికి ప్రవేశించి రోహిత్ మెడకు టవల్ బిగించాడు. లక్ష్మి భర్త కాళ్లు పట్టుకోగా ఆమె ప్రియుడు అతడిని చంపేశాడు. ఆ తర్వాత చప్పుడు కాకుండా ప్రియుడు వెళ్లిపోగా లక్ష్మి నిద్రపోయింది.

 

 


భర్త చనిపోయాడని స్థానికులను ఎలాగో నమ్మిస్తుంది. అయితే ఆరోగ్యంగా ఉండే రోహిత్ ఆకస్మాతుగా ఎలా చనిపోయాడని అతడి తండ్రి మోల్హార్‌కు అనమానం వచ్చింది. దీనికి తోడు కోడలి అక్రమ సంబంధం గురించి అతడికి గతంలోనే తెలుసు.పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కాసేపటికే గ్రామానికి చేరుకుని లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. దీంతో ఇద్దరు ఇప్పుడు కటకటాల వెనక ఊసలు లెక్కబెడుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: