కరోనా... అగ్ర రాజ్యం అమెరికా ను అతలాకుతలం చేస్తుంది. దీని దెబ్బకు ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ముఖ్యంగా దీని ప్రభావం ఆర్ధిక రాజధాని న్యూయార్క్ లో ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో న్యూయార్క్ లో 731 కరోనా మరణాలు సంభవించాయని గవర్నర్ ఆండ్రూ క్యూయోమో వెల్లడించాడు. దాంతో న్యూయార్క్ లో కరోనా మరణాల సంఖ్య 6159 కుచేరింది. ఇక ఓవరాల్ గా కరోనా వల్ల అమెరికా లో లక్షకు పైగా మరణిస్తారని అక్కడి మెడికల్ అడ్వైసరి అంచనా వేసింది. కరోనా కట్టడి విషయంలో దేశ అధ్యక్షుడు ట్రంప్ ఉదాసీనతగా వ్యవహరించడం తో ఇప్పుడు కరోనా అక్కడ విలయతాండవం చేస్తుంది. ఇంత జరుగుతున్న కూడా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను విధించకపోవడం గమనార్హం. 
 
ఇక చైనాలో మొదటి సారి కరోనా మరణం లేని రోజు నమోదైయింది. ఈ వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణికిన ఇటలీ లో ఇప్పుడే ఇప్పుడే కేసుల సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది దాంతో మే 4 నుండి లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. స్పెయిన్ లోకూడా కరోనా  కొంత మేరకు శాంతించింది. ఇక ఇండియాలో మాత్రం రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
 
ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5000 దాటింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలవుతుంది. ఈనెల 14 తో ఈ లాక్ డౌన్ ముగియనుంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండడం తో లాక్ డౌన్ ను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని కేంద్రం భావిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: