ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఈ కరోనా వైరస్.. ఒక్కడితో మొదలై ప్రపంచం మొత్తం వ్యాపించింది.. ఎక్కడ చూడు ఫాస్ట్గా కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఇలాంటి సమయంలో ప్రతి వారు ఎంతో బాధ్యతగా మెలగాలని, అధికారులు, ప్రభుత్వాలు చెబుతున్న గానీ సమాజంలో మార్పు రావడం లేదు.. కాకుల్లా బ్రతకడానికి అలవాటుపడినవారిని హంసల్లా మారమంటే మారుతారా.. అసలే మారరూ.. ప్రస్తుతం సమాజం ఇలాంటి పరిస్దితినే ఎదుర్కొంటుంది..
ఈ కరోనా వల్ల ముందు ముందు మరింత జఠిలమైన మార్పులు సంభవించవచ్చూ.. ఇకపోతే అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో ఉన్న కొందరు కోవిడ్ అనుమానితులు, వైద్యసిబ్బందితో పాటుగా, మిగతావారికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారట.. వారి ఓవరాక్షన్ తో అక్కడవున్న వారిని భయాందోళనలకు గురిచేస్తున్నారని, ఇలా చేయకండని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నా.. వార్డుల నుంచి బయటకు వచ్చివిచ్చలవిడిగా ప్రవర్తిస్తుండటంతో, ఆస్పత్రిలోని స్టాఫ్నర్సులు, కింది స్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
ఇకపోతే హిందూపురం ప్రాంతానికి చెందిన కరోనా పాజిటివ్ కేసుల్లోని వారే ఆస్పత్రిలో అలజడి సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్దితుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్ గదుల నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి వర్గాలు, అధికారులను కోరుతున్నాయి. మనం చెడింది గాక మరింత మందిని చెడగొట్టాలని చూసే ఇలాంటి వరెస్ట్ గాళ్లను ఏం చేయాలో మీరే చెప్పండి.. అసలే కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంటే భయపడకుండా, బాధ పడకుండా ఇలా చేయడం దారుణమంటున్నారు.. ఈ విషయం తెలిసిన వారు..
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle