ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం చేస్తుంది. తాజాగా వ్యూహన్ లో 76 రోజుల తర్వాత నగరంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. దాదాపు 1.10 కోట్ల మంది జనాభా ఉండే వుహాన్ నగరంలోనే కరోనా మహమ్మారి గతేడాది డిసెంబరు చివరిలో తొలిసారి వెలుగుచూసింది. వైరస్ నియంత్రణ చర్యలోల భాగంగా జనవరి 23న చైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. 

 

ఆ తర్వాత హుబే ప్రావిన్సు మొత్తానికి దీనిని విస్తరించారు. తాజాగా, వైరస్ పూర్తిగా నియంత్రణలోకి రావడంతో వుహాన్ ప్రజలకు స్వేచ్ఛ లభించింది. మరోవైపు, మంగళవారం కొత్తగా 62 కేసులు నమోదుకాగా, ఇద్దరు మృతి చెందినట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది.

 

ప్రయాణాలపై కూడా ఆంక్షలు ఎత్తివేయడంతో రైల్వే‌స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. వ్యాపార సంస్థలు కూడా తెరుచుకోవడంతో వీధులు రద్దీగా మారిపోయాయి. ఆంక్షలు ఎత్తివేడయంతో పెద్ద ఎత్తున్న సంబరాలు చేసుకుంటారు. భవంతులు, వంతెనలను విద్యుద్దీపాలతో అలకరించారు. 

 

లాక్‌‌డౌన్ సమయంలో వుహాన్ ప్రజలు కేవలం నిత్యావసరాల కోసమే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు. ఇదిలా ఉండగా మూడు వారాల కిందటే హుబే ప్రావిన్సుల్లో లాక్‌డౌన్ ఎత్తివేశారు. గతేడాది డిసెంంబరు చివరిన చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకూ విస్తరించింది. దీని వల్ల ఇప్పటికే 82వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, 208కిపైగా దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది.

 

వుహాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో పనిచేసే ఓ వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు తొలిసారి డిసెంబరు 1నే గుర్తించారు. అతడిలో వైరస్ లక్షణాలు బయటపడిని ఐదు రోజుల తర్వాత ఆయన భార్య కూడా అనారోగ్యానికి గురయ్యింది. వీరిలో న్యుమోనియా లక్షణాలు బయటపడటంతో హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. కొత్తరకం వైరస్ వీరికి సోకినట్టు గుర్తించిన వుహాన్ వైద్యులు.. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించినట్టు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: