భారత దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న  కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్  డౌన్ విధిస్తూ  కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ మొత్తం నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. ప్రజలు ఇంటికే   పరిమితం కావడంతో కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో 90 శాతం ప్రజలు రోడ్ల మీదికి రావడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తుంది. అటు రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ సమర్థవంతంగా చికిత్స అందించేందుకు క్వారంటైన్ ఏర్పాటు  చేస్తున్నాయి . కరోనా బారిన పడిన వారితో పాటు కరోనా వైరస్  అనుమానితులను కూడా ప్రభుత్వం ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచుతుంది. 

 

 

 దీంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన లాక్ డౌన్  సంపూర్ణంగా విజయవంతం అవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాక్ డౌన్  పై  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పుడు వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి  ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారన్న  విషయం తెలిసిందే. ఎక్కడో కొంతమందిని అలాగే అసోసియేషన్ కేంద్రంలో ఉంచగా... వారు ఏకంగా ఐసొలేషన్ వార్డును  బార్ గా మార్చుకున్నారు. బార్ మాదిరిగానే  మందు పార్టీ చేసుకున్నారు. 

 

 

 ఒరిస్సా లో ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా  వైరస్ లక్షణాలు ఉన్న కొంతమంది తాత్కాలిక ఐసోలేషన్ కేంద్రంలో చేరారు. ఇక తమ పలుకుబడిని ఉపయోగించుకుని.. ఐసోలేషన్ వార్డును  కాస్త భార్ గా  మార్చేశారు. అక్కడి మద్యం తాగి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక ఈ మందు బాబుల బాగోతం మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదే ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారింది . ఇక కరోనా  లక్షణాలు ఉన్న వారికి చికిత్స అందించేందుకు నువపాద  పంచాయితిలో  తాత్కాలికంగా ప్రభుత్వం ఇసోలేషన్  కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: