ప్రపంచంలో అగ్ర రాజ్యంగా వెలిగిపోవాలన్న తపన చైనాకి ఎప్పటి నుంచో ఉంది.. కాకపోతే అమెరికా ఆ స్థానం దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది.  తాజాగా నలభై ఏళ్ల చైనా కల ఇప్పుడు నెరవేరిందనే చెప్పొచ్చు. చైనాను బీట్ చేయాలని ఈ దిశగా చాలా కాలం క్రితమే అక్కడి ప్రభుత్వాలు పగడ్బందీగా అడుగులు వేయడం మొదలెట్టాయి.  ఆ ప్రయత్నాల ఫలితాలన్ని గత దశాబ్దకాలంగా మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. గత  ప్రపంచంలో అత్యధికంగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేస్తున్న దేశాల జాబితాలో చైనా అగ్ర స్థానానికి చేరకుంది.

 

గత 40 ఏళ్లుగా అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ స్థానాన్ని తాజాగా చైనా హస్తగతం చేసుకుంది.  ఈ విషయంలో చైనా తన ఉత్పత్తుల విషయంలో ప్రమోగాల విషయంలో ఎన్నో రకాలుగా అమెరికాకు పోటీగా నిలుస్తున్న విషయం తెలిసిందే.  కానీ చాలా కాలంగా అమెరికాను బీట్ చేయలేకపోతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి చేసుతన్న బీభత్సం అంతా ఇంతా కాదు.  మరోవైపు ప్రపంచ దేశాల మధ్య పేటెంట్ ఒప్పందం కుదిరింది మొదలు అమెరికా సంస్థలే ఇప్పటి వరకూ తమ ఆవిష్కరణలపై అధిక సంఖ్యలో పేటేంట్ల కోసం దరఖాస్తూ చేస్తూ వచ్చాయి.  

 

గత 20 ఏళ్లలో చైనా కంపెనీల పెటెంట్ల దరఖాస్తుల్లో 200 శాతం వృద్ది నమోదైందని ప్రపంచ మేథోసంపత్తి హక్కుల సంస్థ వద్ద నమోదైన గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక అత్యథిక సంఖ్యలో పేటెంట్లకు దరఖాస్తు చేస్తున్న కార్పొరేట్ సంస్థగా చైనాకు చెందిన హువావే అవతరించింది. అయితే హువావే గత మూడేళ్లుగా నెంబర్ వన్ స్థానంలో ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. తయారీ రంగానికే పరిమితమైన చైనాను మేథో సంపత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనుకున్న చైనా పాలకుల ప్రయత్నాలే పేటెంట్ల రూపంలో ఫలితాన్ని ఇస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: