ఛీఛీ.. మనుషులు చచ్చిపోతారు అని అంటున్న.. వైరస్ అందరికి వ్యాపించి ప్రాణాలు తీస్తుంది అని చెప్పిన సరే రాజకీయాలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడేలా? ప్రతిపక్షాల మాటలకూ.. డ్రామాలకు సమాధానాలు చెప్పాలా అనే ప్రశ్నలు పుట్టేలా ఈ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఇప్పుడు విమర్శ చేసాయి.. 

 

ఆ విమర్శపై విజయసాయి రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.. ఆ విమర్శపై తనదైన శైలిలో ట్విట్టర్ వేదిక సంచలన వ్యాఖ్యలు చేశారు.. ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు.. ''ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన పేదలకు ప్రభుత్వం వెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని కన్నా, సిపిఐ రామకృష్ణలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. వీళ్ల యజమానేమో ఐదు వేలివ్వమని రంకెలేస్తుంటాడు. రాజకీయాలు చేయడానికి ఇంత కంటే అనువైన సమయం దొరకలేదా మీకు?'' అంటూ ప్రశ్నించారు. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. రాజకీయాలు చెయ్యడానికి శవాన్ని వాడుకున్నాడో.. ఎటువంటి పరిస్థితులు అయితే ఏంటి రాజకీయం చెయ్యడానికి అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు కామెంట్ చేస్తూ ఈ బాబోరుకు ఏ సమయం అయితే ఏంటి ? రాజకీయం చెయ్యడానికి.. ముసలి కన్నీళ్లు కార్చి ప్రజలను పిచ్చోళ్ళు చేస్తుంటారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా నెటిజన్లు కూడా ప్రతిపక్షాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: