ఏపీలో రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇక అధికార వైసీపీతో పాటు, ప్రతిపక్ష టీడీపీ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, జాగ్రత్తలు చెబుతున్నారు. అలాగే లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ప్రజలని అన్నీ పార్టీల వారు ఆదుకునే పని చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా తనకు చేతనైన సాయం చేస్తున్నారు. ఇప్పటికే తన ఎంపీ నిధులని కరోనాపై పోరాటం చేయడానికి ఇచ్చారు. అలాగే తన పార్లమెంట్ పరిధిలోని పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తాజాగా కూడా నగరంలో కోడిగుడ్లు పంపిణీ చేశారు.

 

ఈ క్రమంలోనే ఎంపీ, డ్వాక్రా మహిళలకు ఉపయోగపడే సమాచారం ఒకటి తెలుసుకున్నారు. లాక్ డౌన్ ఉన్నా, స్వయం ఉపాధి సంఘాల మహిళలపై లోన్స్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఆంధ్రాబ్యాంక్ విజయవాడ పరిధిలోని పార్వతీపురం శాఖ అధికారులు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాని, దీనిపై స్పందించాలని, మహిళలపై ఎలాంటి ఒత్తిడి పెట్టకూడదని యూనియన్ బ్యాంక్ వాళ్ళని కోరారు.

 

అయితే ఇటీవల యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రాబ్యాంక్ వీలీనమైన విషయం తెలిసిందే. ఇక నాని రిక్వెస్ట్‌పై స్పందించిన యూనియన్ బ్యాంక్ వాళ్ళు, బకాయిల చెల్లింపుపై గ్రూపు సభ్యులపై ఒత్తిడి ఉండదని, ఆర్బీఐ జారీ చేసిన మారటోరియంకు యూనియన్ బ్యాంక్ కట్టుబడి ఉందని తెలిపారు. మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 వరకు మారటోరియం అమలులో ఉంటుందన్నారు.

 

పైగా యూనియన్ కోవిడ్-19 సువిధ లోన్ కింద 5000 రూపాయలను కరోనా సహాయక లోన్ కూడా పొందవచ్చని సూచించారు. ఇక ఇలా నాని బాధ్యత తీసుకుని యూనియన్ బ్యాంక్ వల్ల ద్వారా సమాచారం తెలుసుకుని, లోన్లు కట్టాలని టెన్షన్ పడుతున్న మహిళలకు సాయం చేశారు. మొత్తానికి కరెక్ట్ సమయంలో నాని విలువైన సమాచారం తెలుసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: