ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్. ఈ పరిస్థితుల్లో ఎవరి తిప్పలు వాళ్లు పడుతున్నారు. పనులు లేక చాలా మంది పరిస్థులలో జీవితాన్ని గడుపుతున్నారు. మరికొందరు ప్రభుత్వం అందజేసిన సరుకులతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఏదిఏమైనా సగటు బీద వర్గానికి చెందిన ప్రజలు ఈ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు పరిస్థితి మరో రకంగా ఉంది.

 


ఇక అసలు విషయానికొస్తే... ఒకవైపు లాక్ డౌన్ జరుగుతుంటే కామాంధులు మాత్రం వారి అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఈ రాంబన్ జిల్లాలో కేవలం మూడేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అత్యాచారం చేశాడు. రాంబన్ జిల్లాలో ఓ కుగ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి బుధవారం ఇంటి బయట ఆడుకుంటున్న ఆ పాపని చాక్లెట్లు ఇస్తానని చెప్పేసి పక్కింట్లో ఉంటున్న పవన్ సింగ్ బాలికను మాటల్లో పెట్టేసి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికను గదిలోకి తీసుకు వెళ్లి ఆ పాప పై లైంగిక దాడి చేశాడు. దీనితో ఆ చిన్నారి ఏడుపు విన్న తల్లి వెంటనే అతని ఇంటికి వెళ్లగా అక్కడ ఉన్న నిందితుడు పరారయ్యాడు.

 

అక్కడ ఉన్న బాలిక జననాంగాల వద్ద తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె స్థానికుల సహాయంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఆ చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు ధ్రువీకరించడంతో పోలీసులకు పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఫోక్సో చట్టం కింద నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఇటువంటి ఎధవలకి ఎన్ని చట్టాలు వచ్చినా సరిపోవు. ఇలాంటి మూర్ఖులకి ఒక్క మరణ శిక్ష తప్ప మరో శిక్ష లేకుండా చేయాలి. ఈ మూర్ఖులు ఎప్పుడు మారుతారో, దేశాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ దేవుడికే తెలియాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: